Home » NTR District
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో డయేరియా ప్రబలడంతో మున్సిపాలిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగామలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.
విజయవాలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన కాకర్ల సుష్మ కుటుంబ సభ్యులు విజయవాడలో జరిగిన కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చారు. వివరాల్లోకి వెళితే..
పచ్చటి పెళ్లి మండపంలో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి ఎంట్రీతో పెళ్లి కూతురు అక్కడ ఉన్న వారందరికీ షాక్ ఇచ్చింది. పీటలపైనే పెళ్లి ఆగిపోయింది.
తిరువూరు రూరల్ మండలం చిక్కుళ్లగూడెం గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న గ్రేడింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ ప్లస్, ఏ, బి, సి, డి గ్రేడులు శాసన సభ్యుల పనితీరుకు అద్దం పడుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో వివాహితపై అత్యాచారయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు.
రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన పోలీసుల సూచనలను బేఖాతరు చేశారంటూ ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుందని ప్రయాణికులు తెలిపారు..
సంక్రాంతి పండుగ ముగిసింది. దీంతో సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు.. నగరాలకు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.