• Home » Mancherial district

Mancherial district

Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

Tragedy: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

 Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్‌తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా? అని నిలదీశారు.

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్‌ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నాం

మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నాం

మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆకట్టుకున్న బర్డ్‌ వాచ్‌

ఆకట్టుకున్న బర్డ్‌ వాచ్‌

కవ్వాల టైగర్‌ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన బర్డ్‌వాచ్‌ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్‌ కెమెరాల ద్వారా వీక్షించారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

యువత చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్‌ అం బేద్కర్‌ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కాసిపేట మం డల ప్రీమియర్‌లీగ్‌ సీజన్‌ 3 పోటీలను ఆదివారం ప్రారం భించారు.

కార్పొరేషన్‌గా మంచిర్యాల

కార్పొరేషన్‌గా మంచిర్యాల

మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్‌ కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

గోదావరి తీరంలో ఇసుకను తోడేస్తున్నారు..!

గోదావరి తీరంలో ఇసుకను తోడేస్తున్నారు..!

గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి

మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి

పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు అందుగుల శ్రీనివాస్‌, కొంగల తిరుపతిరెడ్డి, రాయబారపు వెంకన్నలు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని, సంక్షేమం కుంటు పడుతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి