Home » Khammam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓసీ-2లో డంపర్ వాహనం టైరు పేలి ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాలచంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్త సమయాన సీతమ్మను మనువాడారు రామయ్య. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది.
భక్తరామదాసును తానీషా నవాబు కారాగారంలో బంధించిన సమయంలో ఆలపించిన కొన్ని కీర్తనల్లో ఈ నగల ప్రసక్తి ఉండటం విశేషం.
ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్ చేస్తున్నారు.
భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
రైతులకు పెట్టుబడిసాయంగా అందజేస్తున్న రైతుభరోసా సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఉద్యోగం రావడం లేదని జీవితంపై విరక్తితో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.