Kavitha: సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి కవిత పిలుపు
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:16 PM
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాటానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా, నవంబర్ 17: డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (సోమవారం) సత్తుపల్లి జేవీఆర్ ఓసీ సింగరేణిలో కార్మికులతో కవిత మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా మెడికల్ బోర్డ్ కోసం కోట్లాడుతున్నామన్నారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నామని ప్రకటించారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదని... డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు.
సింగరేణి గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని.. ‘మీకోసం పోరాటం చేసే మాకు అండగా ఉండాలి అని కోరుతున్నాం’ అని కవిత అన్నారు. కొత్త బొగ్గు బ్లాక్లు సింగరేణికి అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేయడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం సింగరేణికి అక్షరాలా రూ.40 వేల కోట్ల అప్పు ఉందని తెలిపారు.
సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయాలని కోరుతున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణం చేసే లోపు కార్పోరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు పెర్మినెంట్ అయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. బొగ్గు బావిలోకి దిగే ముందు మైసమ్మకు మొక్కుకుని జాగ్రత్తగా ఉండాలని కవిత సూచించారు.
ఇవి కూడా చదవండి
పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు
కొంపల్లి ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ సీరియస్
Read Latest Telangana News And Telugu News