Home » Kalvakuntla kavitha
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మాట్లుతూ... పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ బడ్టెట్ ఇచ్చి చిన్నచూపు చూస్తున్నదని ఆమె ఆరోపించారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్మీట్ పెడతానని వెల్లడించారు.
కూకట్పల్లి అంటే ఒక మిని ఇండియా మాదిరిగా ఉందని కవిత అన్నారు. కానీ ఇక్కడ పేదవాళ్లు రెంట్కు ఇళ్లు తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి పేరును ఒక్క పథకానికైనా ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులకు రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తున్నారు కాని శ్రీకాంతాచారి గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ గా ఉన్నారు. కేసీఆర్ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు.