Home » Karnataka BJP
ప్రతిపక్షనేతగా రెండేళ్లుగా కొనసాగుతున్నా క్వార్టర్స్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని ప్రతిపక్షనేత ఆర్ అశోక్ మండిపడ్డారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ జిల్లా సిగందూరులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఖంగుతిన్న ముఖ్యమంత్రి వివాదం చేస్తున్నారన్నారు.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను స్వపక్ష కాంగ్రెస్ నేతలు, విపక్ష బీజేపీ నేతలని తేడా లేకుండా కుంకుడు కాయల రసంతో తలంటేశారు. నెహ్రూ తర్వాత పాకిస్థాన్ వీధుల్లో ఓపెన్ టాప్ జీప్లో ఊరేగించేది నిన్నే అంటూ..
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న. గవర్నర్కు ఫిర్యాదు చేసి బెంగళూరు అభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు
కర్నాటక ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో రాజ్యసభ అట్టుడికింది
Gold Smuggling Case RanyaRao:గత సోమవారం కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోల్డ్ అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారం, నగదు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది రన్యా. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో రన్యారావుకు...
BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సన్నిహితులే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కర్ణాకట మాజీ సీఎం యడియూరప్ప భార్య మృతి వెనుక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె హస్తం ఉందని మంత్రి బైరతి సురేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ పట్ల అవమానం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేది లేదని పరిషత్ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) పేర్కొన్నారు.
‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.