Home » JDS
బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్ నాయకుడు లోకేశ్(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.
రాష్ట్ర ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ, గ్యారంటీల పేరిట రాష్ట్రాన్ని నిలువు దోపిడీచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని జేడీఎస్ పార్టీ రాష్ట్ర యువఅధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు.
జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్... ప్రజలకు పన్నుల ట్రాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన’ అంటూ.. నిఖిల్ వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్, జేడీఎస్లో చేరే ప్రసక్తే లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా’నని బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటుకు గురైన బసనగౌడపాటిల్ యత్నాళ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని అన్నారు.
మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి అంటూ.. మంత్రి సతీశ్జార్కిహొళి పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడడం కన్నడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
నా రాజకీయ జీవితంలొ ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు బీఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో బీజేపీ సభ్యులు సభకు భంగం కలిగించడం దారుణమన్నారు.
దేవాలయంలాంటా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే కోరిన కోరిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మద్యంప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.
జేడీఎస్(JDS) పార్టీలో తనను సస్పెండ్ చేసే సత్తా ఉన్న నాయకులు లేరని ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ(MLA GT Deve Gowda) అన్నారు. బుధవారం మైసూరు(Mysoor)లో రామ్లల్లా విగ్రహానికి ఉపయోగించిన రాయిని వెలికితీసిన ప్రదేశంలో పూజ చేశారు.
జేడీఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఆపరేషన్ హస్త కుట్ర పన్నారని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) సంచలనమైన ఆరోపణలు చేశారు. బెంగళూరు(Bangalore)లో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.