Home » Jagtial
సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా కౌలు రైతుల ఆశలు నెరవేరడం లేదు.
ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ఎంత ముఖ్యమో తిరిగి భద్రంగా ఇంటికి చేరడం అంతే ప్రధానంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో నిత్య చైతన్యంగా ఉండే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, శ్రేణులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకు ఇక్కడ తమ పార్టీ అధికారంలోనే ఉందా.. ఇన్చార్జి మంత్రి ఉన్నట్టా.. లేనట్టా.. ఉంటే నెలలు గడిచినా ఆయన జిల్లాకు ఎందుకు రాడు, జిల్లా కేంద్రానికి కీలకంగా ఉండే కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు కావడం లేదు.. అసలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలే ఎందుకు ఏర్పాటు కావడం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యేటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటుతోంది.
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సన్నరకాల బోనస్ ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ సీజన్లో కొనుగోలు చేసిన సన్న, దొడ్డు ధాన్యానికి చెందిన డబ్బుల్లో 83 శాతం ఇప్పటికే చెల్లించింది. సన్న ధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ఇస్తానన్న బోనస్ సొమ్ము మాత్రం ఇప్పటికీ చెల్లించ లేదు.
వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలకు దొడ్డురకంతో పాటు సన్నరకం ధాన్యం వస్తోంది. అయితే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి వారం, పది రోజులు గడుస్తున్నప్పటికీ బోనస్ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు పోలీసులు దగ్గరవ్వాలని, ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని డీజీపీ జితేందర్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ మేరకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ను పకడ్భందీగా అమలు చేస్తున్నారు.
జిల్లాను హెల్త్ కేర్ హబ్గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో మెడికల్ అండ్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అహ్లాదంతో పాటు వాకింగ్ ట్రాక్తో ఆరోగ్యాన్ని అందించాలని నగరంలోని ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే పార్కును వాణిజ్య కేంద్రంగా మార్చుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా క్రీడా మైదానంగా ఉన్న జ్యోతిబాపూలే మైదానాన్ని స్మార్ట్ సిటీలో భాగంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించారు. అందులోనే వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఆరు తడి పంటలకు ఆదరణ కరువవుతోంది. ఏడాదికేడాది వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొత్తం పంటల సాగులో 75 శాతానికి పైగా వరి ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. వరి సాగు కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.