Home » Jagtial
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి తిరిగి అధికారంవైపునకు అడుగులు వేయాలని బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తోడుగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకొని జిల్లా పరిషత్లు, మండల పరిషత్లను, పంచాయతీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం రూపొందిస్తున్నది.
పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, డుమ్మాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీరాజ్శాఖ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. సుమారు రెండు నెలలుగా జిల్లాలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కొనసాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సగానికిపైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను, పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రూపొందిస్తున్నది. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్థానాలపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలవడానికి మరోమారు వాహనాలు, పరికరాలు పంపిణీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలకు రూ.4,016 పింఛన్, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరింత బాసటగా నిలువడానికి ప్రయత్నం చేస్తోంది.
జిల్లాలో వానాకాలం సాగు జోరందుకుంది. మూడు రోజులుగా ముసురు వానలతో వాడిపోతున్న పత్తి, మొక్కజొన్న మెట్ట పంటలు ఊపిరి పోసుకున్నాయి. దీంతో రైతులు హుషారుగా పొలం పనుల్లో బిజీగా మారిపోయారు.
బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
క్షయ రహిత జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్ర్కీనింగ్ చేసి ముందస్తుగా గుర్తిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నిండా మునుగుతున్నారు. రైతులకు కాస్తో కూస్తో ధీమా నిచ్చే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) పథకం నాలుగేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఫసల్ బీమాను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయగా, బీమాను అమలుచేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి.
వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద రైతులు మాత్రమే వరినాట్లు మొదలు పెట్టారు. మెట్ట ప్రాంతంలోని రైతులు నీళ్లు లేక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీకి ఇటీవల క్యాబినెట్ నిర్ణయించడంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.