Home » Hyderabad News
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇవాళ(సోమవారం) క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరీ ముఖ్యంగా.. పంతంగి టోల్ప్లాజా వద్ద రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ శంకర్పల్లిలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన చూపు లేని చిన్నారులను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించి, ఆనందభరిత అనుభూతిని అందించింది. సిబ్బంది సహకారం, ప్రత్యేక ఏర్పాట్లతో పిల్లలు రైడ్లు, భోజనం, వినోదాన్ని నిర్బంధం లేకుండా ఆస్వాదించారు.
హైదరాబాద్ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐటీ (CIT.. సెంట్రల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.
హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శంషాబాద్లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు.