Home » Hindi
1981లో విడుదలైన తన చిత్రం 'ఏక్ దుజే కేలియే'ను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఎలాంటి ఇంపొజిషన్ లేకుండానే హిందీని నేర్చుకున్నామని నటుడు కమల్ హాసన్ తెలిపారు. అదొక ఎడ్యుకేషన్ అని అన్నారు. పంజాబీ, కర్ణాటక, ఆంధ్ర భాషలన్నా తనకు అభిమానమేనని చెప్పారు.
మహారాష్ట్ర పాఠశాలల్లో మూడో భాషగా హిందీని తప్పనిసరిచేసే నిర్ణయాన్ని ప్రభుత్వంపై తీవ్ర విమర్శల మధ్య వాయిదా వేసింది. భాషా ప్యానెల్ వ్యతిరేకతతో పాటు ప్రజా విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఆలోచనలో పడింది
భాషా వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకావాలని, వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరూ హిందీని అంగీకరించాలని చెప్పడం లేదని, డీఎంకే కూటమి నేతలు నేతలు చేస్తున్న నిరసనల్నీ వృథా అని అన్నామలై అన్నారు.
హిందీ, ఇతర భారతీయ భాషల మధ్య ఎప్పుడూ పోటీ ఉండదని, అవి మిత్ర భాషలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్పూర్ జిల్లాలోని రెంగ్కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది.
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు మణిపూర్లో ఓ ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తిని కోరుకుంటున్న యువత ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించబోతున్నారు.
మన దేశంలో పరిపుష్టమైన, సౌభాగ్యవంతమైన భాషలు అనేకం ఉన్నాయని, అయితే అవి ప్రగతి నిరోధక భాషలనే ముద్ర వేశారని, ఇంత కన్నా దురదృష్టం వేరొకటి ఉంటుందా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం, 2020 మూడో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన ఆలిండియా ఎడ్యుకేషన్ కన్వెన్షన్ను ప్రారంభించారు.