Home » Harish Kumar
CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
AP DGP Harish Kumar Gupta: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్(AP Assembly Chief Marshal)గా గణేశ్(Ganesh)ను నియమిస్తూ ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గణేశ్ ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్నారు. డీజీపీ ఆదేశాలతో శాసనసభ సెక్రటరీ జనరల్ వద్ద ఆయన రిపోర్ట్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హరీష్ కుమార్ గెప్తా హెచ్చరించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్యాన్సర్తో భాదపడుతున్నారని, అది మూడో దశలో ఉందని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్ల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.