Home » Gachibowli
లైఫ్ సైన్సెస్ కేపిటల్గా హైదరాబాద్కు గుర్తింపు ఉందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతం తెలంగాణ నుంచే అందిస్తామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచే నలబై శాతం ఫార్మా ఉత్పత్తులు వస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్లోనే అత్యధిక వ్యాక్సిన్ల తయారీ ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి ప్రాంతం ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీ భూమి కానేకాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ భూములను కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదని.. తప్పుడు అంచనాల ప్రాతిపదికపై ఆ నిర్ధారణకు వచ్చిందని వివరించింది.
'భాయ్ బచ్చా ఆగయా భాయ్' వాట్సాప్ కోడ్ భాషతో గంజాయి సరఫరా చేస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఇదే కోడ్ ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ చేశారు. అంతే, ఆడామగా తేడాలేకుండా, ఫ్యామిలీలు సైతం..
ఇంట్లో దాచిన డబ్బును పెద్దవాళ్లకు తెలియకుండా ఆన్లైన్ జూదంలో పెట్టి కోల్పోయిన యువకుడు, ఆ డబ్బు గురించి మందలించాడని పగ పెంచుకొని కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపాడు.
అభివృద్ధిలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. భాగ్యనగర అభివృద్ధికి ఎవరూ అడ్డుపడినా ఊరుకునేది లేదని హెచ్చరిచారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధిపైనే తమ దృష్టి అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు.
కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ చైర్మన్కు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు.
కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్కు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి గురువారం హరీష్రావు లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో హరీష్రావు ఎండగట్టారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎ్సబీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్స)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాంపస్ లోని క్వార్టర్స్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఆశించిన స్థాయిలో ధరలు పలకలేదు. ఇటీవల కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ స్థలానికి గజం ధర రూ.2.98 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.