Home » Cyberabad Police
పలువురు అమాయకులను ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
పౌరులకు పారదర్శక సేవలను పెంపొందించడానికి సరికొత్తగా అధికారిక వెబ్సైట్ను ప్రారంభించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉండేలా, ప్రజలకు ముఖ్యమైన హెచ్చరికలు, సమాచారం వెంటనే తెలిసేలా సాంకేతిక బృందం డిజైన్ చేసిందని వివరించారు.
ఆన్లైన్ డేటింగ్ యాప్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన నగరానికి చెందిన యువకుడు రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన యువకుడు (28)కు ఆన్లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో ఓ యువతి పరిచయమైంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 11 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ చేస్తూ.. కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు వెంటనే తమకు కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేరు.
సైబరాబాద్ పోలీస్ కమిషరేట్(Cyberabad Police Commissionerate) పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కమిషనర్ అవినాష్ మహంతి(Commissioner Avinash Mohanty) ఆదేశాలు జారీ చేశారు.
Lookout notice: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితులకు పోలీసులు లకౌట్ నోటీసులు జారీ చేశారు.
Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే అనేక మంది సైబర్ మోసానికి బలయ్యారు. తాజాగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా మోసపోయింది.
Varra Ravinder Case: వైసీపీ నేత వర్రావవీందర్ రెడ్డి కేసులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను చంపేస్తారంటూ బెదిరింపులకు దిగితూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రాపై వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
Telangana: 2024 సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబర్ క్రైమ్లో 11914 కేసులకు గాను రూ.70 కోట్ల అమౌంట్ రికవరీ అయ్యిందన్నారు. డిజిటల్ క్రైమ్ కూడా బాగా పెరిగిందన్నారు. 8 వేల మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు.
అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలతో రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.