Home » Chennai
ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ గ్రూప్ ద్వారా దుష్ప్రచారం చేసిన 30 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
మెట్రోరైలు మార్గం నిర్మాణ పనుల్లో భాగంగా రెండు స్తంభాల నడుమ బిగిస్తున్న 40 అడుగుల పొడవైన సిమెంట్ కాంక్రీట్ గడ్డ్డర్ కూలిపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్న 37 ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలు మార్పుచేసినట్లు దక్షిణ రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి జూన్ 16,19,23, 26,30 తేదీల్లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరే పినాకిని ఎక్స్ప్రెస్ (నెం:12712) 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
విదేశాల్లో చదువు, ఉద్యోగం కోసం వీసాలు ఇప్పిస్తానని నమ్మించి యువకులను నట్టేట ముంచుతున్న ఇద్దరు మోసగాళ్లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్ పూర్తిగా నీటిమట్టమవుతాయని తేలింది.
భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ యాక్ట్, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమన్ యాక్ట్ కింద జ్ఞానశేఖరన్పై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో అతన్ని దోషిగా ప్రకటిస్తూ కోర్టు గత వారం తీర్పు ఇచ్చింది.
కమల్హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అసహనం వ్యక్తం చేశారు.
31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్-గూడూరు సబర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్-చెంగల్పట్టు మధ్య సబర్బన్ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చెన్నైలో సోమవారం వన్ నేషన్-వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు విమానాశ్రయానికి చేరుకుని పవన్కు ఘన స్వాగతం పలికారు.