Home » Bhatti Vikramarka
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్లో చేర్చుకున్నారని అన్నారు.
మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతో జీవిత భీమా తీసుకువచ్చామని తెలిపారు.
తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆరు గ్యారంటీల అమలుకు మొత్తం రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.
తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
ప్రభుత్వాన్ని సర్కస్లా నడిపిస్తున్నారంటూ అధికారులపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని తప్పుడు పనులకు ప్రేరేపిస్తున్నారని ఆయన విమర్శించారు
మూసీ ప్రాజెక్ట్కు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలని కోరుకుంటున్నారా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు.
మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రుణాలు ఇచ్చినట్లు జీవో చూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు కేటీఆర్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.