Home » Bharat Ratna
భారత జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ కొద్ది రోజుల గ్యాప్లోనే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వైట్ జెర్సీలో వీళ్లను చూడలేమనే బాధ ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ఓ అవార్డుతో వీళ్ల అభిమానుల మధ్య ఫైట్ మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పద్మభూషణ్ అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురంలో ఘన పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు
వైద్య రంగంలో ఇప్పటి వరకూ ఎవరికీ భారతరత్న రాలేదని, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఆ మహత్తర అవకాశం దక్కడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
'మహా వికాస్ అఘాడి'లోని తమ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్కు ఉద్ధవ్ థాకరే హితవు పలుకుతూ, సావర్కర్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాట్లాడటం మానుకోవాలని, బీజేపీ సైతం నెహ్రూను టార్గెట్ చేసి మాట్లాడవద్దని అన్నారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.