Home » Anakapalli
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు సోమవారం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్కు శంకుస్థాపన చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు రేపు(సోమవారం) భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది.
మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి అనిత అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి నివాళులర్పించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అభినందించారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
అనకాపల్లి మండలం ఏటికొప్పాక సమీపంలో వరాహ నదీ వద్ద బాలుడు ఆడారి వెంకట్ కౌశిక్ మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మైనర్ బాలుడి చేతిలోని నాటు తుపాకీ పేలడంతోనే కౌశిక్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి అన్నారు.
అనకాపల్లి జిల్లాలో ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు..
అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలం ఘంటవానిపాలెంలో ఈ నెల 15వ తేదీన భారీ చోరీ జరిగింది. ఈ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు..