Home » Amit Shah
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
ఈ పదకొండేళ్లలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం, జాతీయ భద్రతతో కొత్త శకాన్ని దేశం చూస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్షా అన్నారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే సుపరిపాలన సాధ్యమేనని మోదీ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు.
తమిళనాట అధికార డీఎంకే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో జాబితా ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ను సవాలు చేశారు.
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు.
పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని అమిత్షా ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.
Amit Shah: రెండు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెళ్లనున్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.
మావోయిస్టులను ఎన్కౌంటర్లో చంపిన తర్వాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు దహనం చేయడాన్ని సామాజికవేత్తలు, వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, విచారణ కోరుతూ జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని అమిత్షా చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు.
CPI Narayana: బీజేపీపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకుని వచ్చారని నారాయణ చెప్పారు.
KTR comments on CM Revanth: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అయితే, దెయ్యం రేవంత్ అని బీఆర్ఎస్ ఛీప్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడీ అరెస్ట్ చేయకుండా కాపాడాలని ఢిల్లీలో సీఎం రేవంత్ అమిత్షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.