కెనడాలో మృతి చెందిన తమ కూతురి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో సహకరించాలని బాధిత కుటుంబం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బస్ స్టాప్లో నిలబడ్డ యువతికి ప్రమాదవశాత్తూ తూటా తగలడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
దుబాయిలో జరిగిన పాకీస్తాని ఉన్మాది దాడిలో మృతి చెందిన తెలంగాణ వాసుల మృతదేహాలు శనివారం స్వదేశానికి చేరుకున్నాయి. ఈ తరలింపులో దుబాయిలోని ఎన్నారైలు తమ వంతు సహకారం అందించారు.
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన తెలంగాణ అనేక రంగాల్లో ముందడుగు వేస్తోందని అన్నారు.
NRI News: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.అందులోభాగంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
డల్లాస్లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నసీం షేక్ సమన్వయంలో శనివారం ఇర్వింగ్లోని విమల్ బాంక్వెట్ హాల్లో ఈ వేడుకను స్థానికులతో కలిసి నిర్వహించారు.
దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వ్యక్తుల కుటుంబసభ్యులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టు టీజీఎమ్డీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి తెలిపారు.
పీఎస్పీ ప్రోగ్రామ్ కింద ఏప్రిల్ 14న నిర్వహించిన ఎక్స్ప్రెస్ ఎంట్రీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులను పర్మెనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవాలంటూ ఐఆర్సీసీసీ ఆహ్వానాలు పంపింది.
ట్రంప్ పాలన తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వరుసగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన మే వీసా బులెటిన్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ముఖ్యంగా EB-5 వీసా అన్రిజర్వ్డ్ కేటగిరీలో చేపట్టిన మార్పులు, అమెరికాలో శాశ్వత నివాసం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయి.
అమెరికాలో ఉంటున్న వారు విదేశీయులు తమ పేర్లను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఇప్పటికే వీసా, గ్రీన్ కార్డు ఉన్న వారు మాత్రం వాటిని నిత్యం తమ వెంటే పెట్టుకోవాలని పేర్కొంది.
సౌదీలో కోట్లకు పడగలెత్తిన ఇద్దరు ఎన్నారైల జీవితం విషాదంతంగా ముగిసింది. అక్రమమార్గాల్లో కోట్లు సంపాదించినా చివరకు చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి కన్నుమూశారు.