మామిడి శ్రీఖండ్.. చూస్తేనే నోరూరిపోతుంది..
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:42 PM
మామిడి పండు గుజ్జు - కప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, చక్కెర పొడి - పావు కప్పు, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, బాదం పలుకులు - స్పూను, పిస్తా పలుకులు - స్పూను, మామిడి పండు ముక్కలు - కొన్ని.
కావలసిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు - కప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, చక్కెర పొడి - పావు కప్పు, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, బాదం పలుకులు - స్పూను, పిస్తా పలుకులు - స్పూను, మామిడి పండు ముక్కలు - కొన్ని.
తయారుచేసే విధానం: పెరుగును గిలక్కొట్టాలి. ఆ తరవాత అందులో మామిడి పండు గుజ్జు, చక్కెర, యాలకుల పొడి, కుంకుమ వువ్వు పాలు కలపాలి. చక్కెర కరిగేవరకు బాగా కలిపి ఆ తరవాత బాదం, పిస్తా పలుకులు వేసి కప్పుల్లో వేసి సర్వ్ చేస్తే సరి. అయితే పైన మామిడి పళ్ల ముక్కల్ని వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!
ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్’: ఏబీవీ
Read Latest Telangana News and National News