వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు

ABN, Publish Date - Apr 05 , 2026 | 02:08 PM

ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహోత్సవాలు చివరి రోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం కన్నుల పండుగుగా జరిగింది.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 1/11

ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహోత్సవాలు చివరి రోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం కన్నుల పండుగుగా జరిగింది.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 2/11

ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని అర్చకులు మేల్కొపారు.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 3/11

అనంతరం ఆలయశుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీలక్షణ సమేత శ్రీసీతారాములవారిని తిరుచ్చిలో సుదర్శన చక్రతాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 4/11

ఉదయం 10.30 నుంచి 11.15 గంటల వరకు స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 5/11

సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు,చందనంతో అభిషేకం నిర్వహించారు.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 6/11

అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ పుష్కరణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 7/11

మార్చి 26వ తేదీన ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 8/11

ఏప్రిల్ 1వ తేదీ రాత్రి అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం జరిగింది.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 9/11

ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు సమర్పించారు.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 10/11

ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, పురవీధులు రంగురంగుల దీపాలతోపాటు ప్రదర్శన బోర్డులకు రంగురంగుల లైటింగ్‌‌తో అలంకరించారు.

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు 11/11

భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగిశాయి.

Updated at - Apr 05 , 2026 | 02:12 PM