కట్టెల పొయ్యితో మహిళల కష్టాలు చూడలేక

ABN, Publish Date - May 28 , 2025 | 04:36 PM

Mahanadu 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగదిలో మహిళల కష్టాలు చూడలేకా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.

కడప, మే 28: జిల్లాలో టీడీపీ మహానాడు (TDP Mahanadu) రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహానాడు వేదికపై టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దృష్టి సారించారన్నారు. ప్రతీ ఒక్క పథకాన్ని అమలు చేసేందుకు కార్యచరణను సిద్ధం చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలలో దీపం పథకం ముఖ్యమైనదని తెలిపారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వంటగదిలో మహిళలు పడుతున్న కష్టాన్ని చూసి.. కట్టెల పొయ్యి వద్ద మహిళలు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు.


మహిళలకు గ్యాస్ సిలిండర్లు, గ్యాస్‌స్టౌవ్‌లు అందించారని గుర్తుచేశారు. నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దీపం పథకం ద్వారా ప్రతీ సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్నారని.. గత సంవత్సరం నవంబర్ 1న దీపం పథకం అమలుకు శ్రీకారం చుట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పట్టాభి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి

Read Latest AP News And Telugu News

Updated at - May 28 , 2025 | 04:46 PM