దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను చంపిన కోడలు..

ABN, Publish Date - Nov 08 , 2025 | 01:33 PM

ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకూ ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దు అన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండీషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం: పెందుర్తికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి అనుమానస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అగ్నిప్రమాదం జరిగి తన అత్త చనిపోయిందని చెప్పిన కోడలు లలితే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన పేరు బయటికి రాకుండా ఉండేందుకు అగ్నిప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించినట్లు తేల్చారు. అయితే ఆమె తన అత్తను చంపే క్రమంలో వ్యవహరించిన తీరు పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

Updated at - Nov 08 , 2025 | 01:33 PM