కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధన ఉత్సవాలు
ABN, Publish Date - Nov 19 , 2025 | 09:04 PM
కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి తిరునాళ్ల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి
పల్నాడు జిల్లా: కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి కారంపూడి తిరునాళ్ల(Palnati Karamputi Festival) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి. స్వామివారికి స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని రైతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నుంచే మొదలయ్యాయి. ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. పల్నాడు ఉత్సవం పేరుతో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కారంపూడి తరలివచ్చారు. ఇక విద్యుతు కాంతులతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగుతుంది.
ఇవి కూడా చదవండి..
నితీశ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు విజ్ఞప్తి
కొందరి ఉగ్రకుట్రలకు కశ్మీరీలందరినీ బాధ్యులను చేయొద్దు.. సీఎం ఆవేదన
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated at - Nov 19 , 2025 | 09:06 PM