కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదన్న మంత్రి
ABN, Publish Date - Apr 11 , 2025 | 03:44 PM
Sridhar on KTR Allegations: మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్సీయూ భూముల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 11: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ (Former Miniter KTR) చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కొట్టిపారేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఇలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోమని చెప్పారు. హెచ్సీయూ భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారు అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాము ఏం చేసినా చట్టాలకు లోబడే చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను బద్నాం చేయడమే బీజేపీ, బీఆర్ఎస్ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్సీయూ భూముల్లో ఏనుగులు ఉన్నట్టు ప్రచారం చేశారన్నారు. ఎక్కడో చనిపోయిన జింకలు ఇక్కడే ఉన్నట్టు పోస్టులు పెట్టారన్నారు. బీఆర్ఎస్ ది ఏఐ విద్య అంటే మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
KTR Vs CM Revanth: రేవంత్కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 11 , 2025 | 03:45 PM