12న కూటమి భారీ బహిరంగ సభ

ABN, Publish Date - Jun 10 , 2025 | 04:58 PM

Amaravati Sabha: అమరావతిలో ఈనెల 12న భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సభను నిర్వహించనున్నారు.

అమరావతి, జూన్ 10: కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది సందర్భంగా ఈనెల 12న అమరావతిలో భారీ సభను (Amaravati Sabha) నిర్వహించనున్నారు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) వివరించనున్నారు. అలాగే వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రణాళికలు ఏంటి, నాలుగేళ్ల పాలన ఏ విధంగా కొనసాగనుంది అనే దానిపై ఈ వేదిక ద్వారా చెప్పే అవకాశం ఉంది.


వచ్చే నాలుగేళ్ల పాలనకు సంబంధించి డ్రాఫ్ట్‌‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం మొత్తాన్ని కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

కొమ్మినేని శ్రీనివాస్‌కు రిమాండ్

కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం: మంత్రి లోకేష్

Read latest AP News And Telugu News

Updated at - Jun 10 , 2025 | 05:04 PM