ప్రమాదానికి ముందు విమానంలో గుజరాత్ మాజీ సీఎం

ABN, Publish Date - Jun 12 , 2025 | 06:21 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్ప కూలింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. అయితే ఈ ప్రమాదానికి ముందు విమానంలో విజయ్ రూపానీ.. తన సీట్లో కూర్చొని జ్యూస తాగుతోన్నారు. ఆ క్రమంలో ఆయన ముందు ఉన్న మరో ప్రయాణికురాలు తన సెల్ ఫోన్‌లో.. విజయ్ రూపానిని ఫొటో తీశారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 12 , 2025 | 06:25 PM