బాధితుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్
ABN, Publish Date - Jun 04 , 2025 | 08:38 PM
ఆర్సీబీ విజయోత్సవాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.
బెంగళూరు, జూన్ 04: ఆర్సీబీ విజయోత్సవాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన ప్రజలను క్షమాపణలు కోరారు. ఈ విజయోత్సవ ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారన్నారు. వారిపై పోలీసులు ఎటువంటి లాఠీ ఛార్జీ చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు మృతులు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా కింద అందజేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అభివర్ణించారు. ఘటనలో 11 మంది మరణించారని తెలిపారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందన్నారు. దాదాపు 3 లక్షల మంది జనం వచ్చారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 04 , 2025 | 08:38 PM