దేవినేని కుమారుడి వివాహానికి సీఎం రేవంత్, మంత్రి లోకేష్

ABN, Publish Date - Apr 30 , 2025 | 01:06 PM

Devineni Son Wedding: మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమరావతి, ఏప్రిల్ 30: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Former Minister Devineni Uma Maheswara Rao) కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను సీఎం ఆశీర్వదించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విజయవాడలోని ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రేవంత్ చేరుకున్నారు. వివాహ వేదిక వద్ద తెలంగాణ సీఎంకు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి స్వాగతం పలికారు. అలాగే ఈ వివాహానికి మంత్రి లోకేష్ (Minister lokesh) కూడా హాజరయ్యారు.


నూతన దంపతులను ముఖ్యమంత్రి రేవంత్ , మంత్రి లోకేష్ ఆశీర్వదించించారు. ఈ పెళ్లిలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండపంలోకి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి లోకేష్ కలిసివచ్చారు. రేవంత్‌ను చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. ఈ వివాహానికి మంత్రి లోకేష్, మంత్రులు, టీడీపీ నాయకులతో పాటు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ కూడా హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

Read Latest AP News And Telugu News

Updated at - Apr 30 , 2025 | 01:07 PM