AP NEWS: తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..పెట్రోల్ పోసి
ABN, First Publish Date - 2025-04-01T18:52:55+05:30 IST
పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో దారుణం జరిగింది. తమ్మిశెట్టి చిరంజీవి అనే వ్యక్తిపై ఓ యువతి పెట్రోలు పోసి నిప్పంటించింది.
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో దారుణం జరిగింది. తమ్మిశెట్టి చిరంజీవి అనే వ్యక్తిపై ఓ యువతి పెట్రోలు పోసి నిప్పంటించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని యువతి ఆరోపిస్తుంది. గాయపడ్డ చిరంజీవిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు.
తమ్మిశెట్టి చిరంజీవిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ తనపై అవసరంగా దుష్పచారం చేస్తున్నారని యువతి ఆరోపించింది. పెట్రోల్తో దాడి చేసిన యువతి కూడా ఉయ్యందన గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. స్థానికులు వెంటనే యువకుడిపై ఉన్న మంటలను ఆర్పివేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. యువతిపై చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News
Updated at - 2025-04-01T18:58:32+05:30