Khammam: యూటీఎఫ్ వ్యవస్థాపకుడు రావెళ్ల ఇకలేరు
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:30 AM
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) వ్యవస్థాపకుడు రావెళ్ల రాఘవయ్య (91) కన్నుమూశారు. అనారోగ్యంతో విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ఖమ్మానికి మృతదేహం.. ఆదివారం అక్కడే అంత్యక్రియలు
ఖమ్మం ఖానాపురం హవేలి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) వ్యవస్థాపకుడు రావెళ్ల రాఘవయ్య (91) కన్నుమూశారు. అనారోగ్యంతో విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రి ఖమ్మం శ్రీనివాసనగర్లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. రావెళ్ల మరణం యూటీఎఫ్ సంఘానికి ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర లోటు అని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తంచేసింది.. రాఘవయ్య సతీమణి సరస్వతి పదేళ్ల క్రితమే మృతిచెందారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో రాఘవయ్య జన్మించారు. ఖమ్మంలో స్థిరపడ్డారు. 1951లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి.. వివిధ చోట్ల పనిచేసి 1986లో ఉద్యోగ విరమణ చేశారు. 1974లో యూటీఎ్ఫను స్థాపించారు. 1975లో వ్యవస్థాపక కన్వీనర్గా ఎన్నికయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పాల్గొన్నారు. శ్రీనివాసనగర్లోని గ్రంథాలయాన్ని నిర్మించారు. యూటీఎఫ్ భవన నిర్మాణానికి కృషి చేశారు. ఆదివారం ఉదయం ఖమ్మంలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News