Share News

Temperature Rise: 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు!

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:04 AM

అన్ని జిల్లాల్లోనూ 37 డిగ్రీలకు పైగానే ఎండ తీవ్రత కనిపించింది. వచ్చే 2రోజులు ఎండ తీవ్రత అలాగే ఉంటుందని హెచ్చరించింది. ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్నింటికి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Temperature Rise: 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు!

  • మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో 39.8 డిగ్రీలు

రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శనివారం 12 జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జగిత్యాల, గద్వాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్‌, ఖమ్మం, మంచిర్యాల, రంగారెడ్డి, భూపాలపల్లి, భదాద్రి కొత్తగూడేం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 37 డిగ్రీలకు పైగానే ఎండ తీవ్రత కనిపించింది. వచ్చే 2రోజులు ఎండ తీవ్రత అలాగే ఉంటుందని హెచ్చరించింది. ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్నింటికి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:04 AM