ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్కు
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:18 AM
దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.

గత వారం హత్యకు గురైన ప్రేమ్సాగర్, శ్రీనివాస్
శవపరీక్షల అనంతరం అనుమతిచ్చిన దుబాయి పోలీసులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు. అయితే మృతదేహాల గుర్తింపులో జాప్యం జరిగింది. దీంతో శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఇద్దరి మృతదేహాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. దుబాయిలోని ఖుబూ్సలు తయారు చేసే కేంద్రంలో ఓ పాకిస్థానీ.. నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివా్సను హత్య చేసిన సంగతి తెలిసిందే. శవ పరీక్షల అనంతరం మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు దుబాయి పోలీసులు అనుమతించారు.
దీంతో హత్య జరిగిన ఎనిమిది రోజుల తర్వాత మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అందనున్నాయి. దుబాయి పోలీసులు తమ విచారణలో ఏ రకమైన విదేశీ జోక్యాన్నీ అనుమతించరు. ఈ కేసులో కూడా ఎవరి ప్రమేయం లేకుండా విచారణ జరిపిన దుబాయి పోలీసులు.. శవపరీక్షలను నిర్వహించి, మృతదేహాల తరలింపునకు అనుమతి ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలంటూ దుబాయిలోని భారత అధికారులకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ వేర్వేరుగా సూచించారు.
బాధితుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం..
హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్ధ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News