Share News

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - May 30 , 2025 | 04:46 AM

వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

  • అసైన్డ్‌ భూముల్లో పొజిషన్‌లో ఉన్న వారికి పట్టాలు

  • సమీక్షలో భట్టి, తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి

ఖమ్మం, మే 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వర్షాకాలం వ్యాధులు, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన సమీక్షలో వారు మాట్లాడారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.


ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే అధికారులదే బాధ్యతన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అర్హులైన నిరుద్యోగులకు, యువతకు రాజీవ్‌యువ వికాసం కింద మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో అసైన్డు భూములు సాగుచేస్తూ పొజిషన్‌లో ఉన్న పేద రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తుందని తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 04:46 AM