Home » Komati Reddy Venkat Reddy
కేసీఆర్.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.
Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం ఎనిమిదో వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయద ల్చిన రోడ్ల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. తొలిదశలో 5,189 కిలోమీటర్ల పరిధిలో రహదారులను అభివృద్ధి చేయాలని శాఖ అధికారులు గుర్తించారు.
గత ప్రభుత్వ హయంలో ఫార్మా సిటీ పేరుతో రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఫార్మా సిటీ పేరుతో నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, దానికి వ్యతిరేకంగా తామే పోరాటం చేశామని చెప్పారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓఆర్ఆర్ అమ్మకంపై బీఆర్ఎస్ సర్కారును ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేయని పనులను 15 నెలల్లో చేసినట్లు పేర్కొన్న ఆయన, ఆర్ఆర్ఆర్ భూసేకరణ, పర్యావరణ అనుమతుల విషయంలో వివరణ ఇచ్చారు
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండ యూనిట్ కార్యాలయంలో జరిగిన కార్ అండ్ బైక్ రేస్ డ్రా కార్యక్రమానికి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుతులకు సంబంధించి డ్రా తీశారు.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ 2024-25 కోసం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. 8,128 కేంద్రాలు ఏర్పాటు చేసి, 137 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. అంగీకరించిన కనీస మద్దతు ధరతో పాటు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చే అంశం ప్రకటనైంది.
మేం అటు ఇటు ఎక్కడికీ పోం. పదేళ్లు ఇక్కడే (అధికారంలో) ఉంటాం. మీ (బీఆర్ఎ్స)లాగా ఎక్కువ మాట్లాడం.. పని ఎక్కువ చేస్తాం’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో అన్నారు.