Share News

Telangana government: మరో 2,500 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:37 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ..

Telangana government: మరో 2,500 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఆ రుణాన్ని సేకరించింది. 32 ఏళ్ల కాల పరిమితి, 7.10 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు; 35 ఏళ్ల కాల పరిమితి, 7.09 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోటు;్ల 38 ఏళ్ల కాల పరిమితి, 7.09 శాతం వార్షిక వడ్డీతో రూ.500 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకున్నది. తెలంగాణతో కలిపి దేశంలోని 12 రాష్ట్రాలు రూ.26,900 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.

Updated Date - Jul 16 , 2025 | 05:37 AM