Bhatti Vikramarka: ఫాంహౌస్లో పడుకొని ప్రేలాపనలా?..
ABN , Publish Date - May 09 , 2025 | 03:44 AM
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కారానికే అధికారులతో కమిటీ వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఏడాదిలో ఆరోగ్యశాఖకు 11,487 కోట్లు వెచ్చించాం: భట్టి
450 కోట్లతో రాష్ట్రంలో 90 ట్రామా సెంటర్లు: దామోదర
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తాం: తుమ్మల
ఖమ్మానికి మణిహారంలా ప్రభుత్వ వైద్య కాలేజీ: పొంగులేటి
ఖమ్మం, మే 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కారానికే అధికారులతో కమిటీ వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వైద్య, ఆరోగ్యశాఖకు 5,959 కోట్ల కేటాయింపులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యం కోసం ఏడాదిలోనే రూ.11,487కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలం బాలప్పేట సమీపంలో రూ.130 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలకు గురువారం మంత్రులు భట్టి, దామోదర, తమ్మల, పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. ఫామ్హౌ్సలో పడుకున్న వారు ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.
ఆరోగ్యశ్రీకి గత పాలకులు ఏడాదికి రూ.54.12కోట్లు ఖర్చుచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే రూ.306కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ.450కోట్లతో 90 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఖమ్మానికి మణిహారంలా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే లక్ష్యంతో పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందు లున్నా తమ ప్రభుత్వం మెడికల్, నర్సింగ్ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నందున ఇక్కడ నర్సింగ్ కళాశాల మం జూరు చేయాలని కోరారు. కాగా, ఖమ్మం జిల్లా ఆస్పత్రిని గురువారం మంత్రుల బృందం సందర్శించింది.
18న ఇందిరా సౌర గిరి జల వికాసానికి శ్రీకారం
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల పోడు భూములకు సాగు నీటి వసతిని కల్పించడంతో పాటు సౌర విద్యుత్తును అందించడానికి రూ.12,600 కోట్లతో రూపొందించిన ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ పథకాన్ని ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరులో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఈ పథకంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News