CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట..
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:27 AM
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి భారీ ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిళ్లిందంటూ ఆ పార్టీ కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు.

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి భారీ ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిళ్లిందంటూ ఆ పార్టీ కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారని వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచాణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.