Trains: గద్వాల, కర్నూల్ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - May 02 , 2025 | 09:06 AM
గద్వాల, కర్నూల్ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు చర్లపల్లి-తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

- చర్లపల్లి-తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ సిటీ: వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి- తిరుపతి(Cherlapalli- Tirupati) మధ్య ఈ నెల 8,9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) నిర్ణయించింది. 8వ తేదీన ప్రత్యేకరెలు(నెంబర్ 07259) చర్లపల్లి నుంచి బయలుదేరి తిరుపతికి రాత్రి 9.35 గంటలకు చేరుకుంటుంది. 9వ తేదీన ప్రత్యేక రైలు ( నెంబర్ 07260) తిరుపతి నుంచి బయలుదేరుతుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎవరైనా రాంగ్సైడ్ డ్రైవింగ్ చేస్తే.. ఫొటో తీయండి.. పోస్టు చేయండి
మార్గ మధ్యంలో మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్నగర్, జడ్చెర్ల, మహబూబ్నగర్, వనపర్తి(Shadnagar, Jadcherla, Mahabubnagar, Wanaparthy), గద్వాల, కర్నూల్, డోన్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్, రేణిగుంట(Rajampet, Renigunta) స్టేషన్లలో ఆగుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..
Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత
Read Latest Telangana News and National News