Share News

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ

ABN , Publish Date - May 15 , 2025 | 03:01 PM

RTC Staff Scandal: సీజ్ చేసిన బోరుబండి వాహనాన్ని సెక్యూరిటీ కోసం పరిగి బస్‌ డిపోలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్‌ను మార్చేశారు.

RTC Staff Scandal: కాసుల కోసం దిగజారిన ఆర్టీసీ సిబ్బంది.. విషయం ఇదీ
RTC Staff Scandal

వికారాబాద్ జిల్లా, మే 15: జిల్లాలోని పరిగి ఆర్టీసీ బస్ డిపోలో (Parigi RTC Depot) వాహనాల ఇంజన్ నంబర్ల ట్యాంపరింగ్ కలకలం రేపింది. సీజ్ చేసి సెక్యురిటీ కోసం ఉంచిన వాహనాల ఇంజన్ నంబర్లు, చేసిస్ నంబర్లు మార్చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ సిబ్బంది కాసుల కక్కుర్తి... ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చేలా చేసింది. గత సంవత్సరం అక్టోబర్‌లో వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి వాహన యజమానిపై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఈ బోరుబండిని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ గతంలోనే సీజ్ చేశారు పోలీసులు.


ఈ నేపథ్యంలో సెక్యురిటీ కోసం బోరుబండిని పరిగి బస్ డిపోలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో సదరు బోరుబండి యజమాని తన వాహనాన్ని రిలీజ్ చేయించేందుకు అనేక తప్పులు చేయించాడు. డిపోలో ఉన్న వాహనం పేరిట మరో రిజిస్ట్రేషన్‌తో సర్టిఫికెట్ సృష్టించి అన్ని పత్రాలు ఉన్నాయంటూ కోర్టును తప్పుదోవ పట్టించాడు. ఆర్టీసీ సిబ్బందికి కాసుల ఆశ చూపి గుట్టు చప్పుడు కాకుండా వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్‌ను యాజమాని మార్చేశాడు. నకిలీపత్రాలు నిజమని భావించిన కోర్టు.. రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చింది. రిలీజింగ్ ఆర్డర్‌ను పరిగి పోలీసులకు పంపించాడు బోరుబండి యజమాని. అయితే వాటిని పరిశీలించిన పోలీసులు.. అవి నకిలీవని తేల్చారు.

Rajnath Singh: పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి.. రాజ్‌నాథ్ సింగ్ విజ్ణప్తి..


బోరు వాహనం నెంబర్లు మార్చారని పోలీసులకు తెలిసి ఆర్టీసీ సిబ్బంది, అధికారులను విచారణ చేసినప్పటికీ టాంపరింగ్ వ్యవహారం బయటకు రాకుండా జాగ్రత్త వహించారు. వాహనం నెంబర్ టాంపరింగ్ వ్యవహారంలో ఆర్టీసీ డిపో మేనేజర్ విషయాన్ని దాటవేసేందుకు యత్నించారు. అసలు బోరు బండి తమ డిపోలో పెట్టినట్టు రికార్డులో లేదని, పోలీసుల అంతర్గత ఒప్పందంతో మాత్రమే డిపోలో పెట్టుకున్నామన్నారు. టాంపరింగ్ వ్యవహరంతో తమకు సంబంధం లేదని డిపో మేనేజర్ తెలిపారు. టాంపరింగ్ వ్యవహారం ఆర్టీసీ ఉన్నతాధికారులకు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు చేరింది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో, అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు.. కారణమిదే

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. భారీగా తరలివస్తున్న భక్తులు


Read Latest
Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:25 PM