Share News

Pranay Case: ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ

ABN , Publish Date - Mar 10 , 2025 | 09:02 AM

Pranay Case: తెలంగాణ వ్యాప్తంగా పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో విచారణ తుది దశకు చేరుకుంది. ఇవాళ నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Pranay Case: ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ
Pranay Case

నల్గొండ :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో తుది తీర్పును ఇవాళ(సోమవారం) నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న హత్యకు ప్రణయ్ గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా.. దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు.


ప్రణయ్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా..

ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ కేసులో మారుతిరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నడుస్తుండగానే ఆత్మహత్యకు ఏ1 నిందితుడు మారుతీరావు పాల్పడ్డాడు. ప్రణయ్‌ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృతవర్షిణి నుంచి వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అన్ని కోణాల్లో విచారణ

నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా రోజువారీగా 102 మందిని విచారించింది. కోర్టు ఇప్పటికే ప్రణయ్‌ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ హత్యకేసు విచారణ తుది దశకు చేరుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్‌ 12న చార్జిషీట్‌ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ ప్రారంభించింది. సుమారు 5సంవత్సరాల 9నెలల కాలం పాటు విచారణ కొనసాగగా, పోలీస్‌ శాఖ సమర్పించిన చార్జిషీట్‌ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతోపాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ రోజుకు రిజర్వు చేసింది.


చార్జిషీట్‌లో నిందితులు వీరే..

ప్రణయ్‌ హత్యకేసులో ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ2 బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మ, ఏ3 అజ్గర్‌అలీ, ఏ4 అబ్ధుల్‌బారీ, ఏ 5 ఎం.ఏ కరీం, ఏ 6 తిరునగరు శ్రవణ్‌కుమార్‌, ఏ 7 శివ, ఏ 8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు(ఏ-1) 2020మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

Congress: అభ్యర్థిత్వం అనూహ్యం

Harish Rao: రేవంత్‌రెడ్డీ.. పైశాచికానందం నీదే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 09:10 AM