Share News

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

ABN , Publish Date - May 27 , 2025 | 12:04 PM

Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..
Jagadish Reddy press meet

సూర్యాపేట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working President), మాజీ మంత్రి కేటీఆర్‌ (Ex Miniter KTR)కు ఏసీబీ నోటీసులు (ACB Notices), సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Ex Minister ACB Notices) ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. అందాల పోటీల నిర్వహణలో విఫలమై ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోగొట్టారని, కేటీఆర్ విజన్ ఖండతరాలు పాకుతుంటే ఓర్వలేకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేష్టలతో త్వరలో ప్రజల్లో తిరుగుబాటు ఖాయమని, కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.


ఏసీబీ విచారణకు సహకరిస్తా..

కాగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ.. తాను ఏసీబీ విచిరణకు సహకరిస్తానని అన్నారు. అయితే యూకే, యూఎస్ వెళ్లేందుకు తాను ముందుగానే ప్లాన్ చేసుకున్నానని, తాను పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతానని అన్నారు.

Also Read: విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె ఉధృతం..


కక్ష సాధింపు రాజకీయాలు..

మరోవైపు కేటీఆర్‌కు ఏసీబీ ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలని, తప్పుడు కేసులు కోర్టులో నిలబడవని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేవని అన్నారు. తాము కేటీఆర్‌కు మద్దతుగా ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులకు ఉందని కవిత అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నమ్మించి మోసం.. యువతి ఏం చేసిందంటే..

మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 12:04 PM