Miss World competitions: బొట్టుపెట్టి.. మంగళహారతులతో స్వాగతం
ABN , Publish Date - May 01 , 2025 | 07:01 AM
ఈనెలలో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలకనున్నారు. దాదాపు120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు.

- మిస్ వరల్డ్ పోటీ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు
- శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగత వేదిక
- ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు విమానాశ్రయం(Airport)లో తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలకనున్నారు. సుమారు 120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. వారికి బొట్టుపెట్టి మంగళహారతులతో ఘన స్వాగతం పలకడానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శంషాబాద్ వినామానాశ్రయం ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: బెదిరించి బీఆర్ఎస్ ఎన్నికల బాండ్లు కొనిపించారు
పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్రెడ్డి బుధవారం శంషాబాద్ విమానాశ్రయాన్ని(Shamshabad Airport) సందర్శించి స్వాగత సత్కారాల ఏర్పాట్లను పరిశీలించారు. శంషాబాద్ పోలీస్ అధికారులతో సమావేశమై విమానాశ్రయ అధికారులు, స్థానిక పోలీసుల సమన్వయంతో భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ఈనెల 31 వరకు 72వ మిస్వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్కు బానిసలు
Read Latest Telangana News and National News