Share News

Minister Ponnam: అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‏ను గెలిపిస్తుంది..

ABN , Publish Date - Jul 30 , 2025 | 09:37 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Minister Ponnam: అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‏ను గెలిపిస్తుంది..

- స్థానికులకే జూబ్లీహిల్స్‌ టికెట్టు

- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై పొన్నం

- అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‏ను గెలిపిస్తుందని వెల్లడి

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.


సర్వేల ద్వారా సరైన అభ్యర్థిని ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. కంటోన్మెంట్‌(Cantonment) ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‏కే పట్టం కట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. పేదలకు వారు ఉంటున్న ప్రాంతాల్లోనే పక్కా గృహాలను నిర్మించేలా ఇందిరమ్మ మోడల్‌ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.


city6.2.jpg

ఆగస్టు 1 నుంచి నగరంలో ఉన్న 15 నియోజకవర్గాల్లో రేషన్‌కార్డులు పంపిణీ మొదలు పెడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో నాయకులు అజహరుద్దీన్‌, నవీన్‌యాదవ్‌, కార్పొరేటర్లు బాబాఫసీయుద్దిన్‌, సీఎన్‌ రెడ్డి, భవానీ శంకర్‌, గొంటి సాయినాథ్‌యాదవ్‌, కిరణ్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 09:37 AM