Hospital power cut: సెల్ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం
ABN , Publish Date - Jun 01 , 2025 | 08:52 AM
Hospital power cut: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది.

సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ (Zaheerabad) ఏరియా ఆస్పత్రిలో (Area Hospital) సమస్యలు వెంటాడుతున్నాయి. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే (power cut) సెల్ఫోన్, టార్చ్ లైట్ వెలుతురుతోనే (Mobile, Torch Flashlights) రోగులకు వైద్యం అందించాల్సిన (Patients Medical services) దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో రెండు భారీ జనరేటర్లు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మరోవైపు విద్యుత్ సరఫరా జనరేటర్ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులతోపాటు డాక్టర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్..
కాగా జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చ్ లైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు ఏరియా ఆస్పత్రికి వెళ్లి విచారించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అతనిని సస్పెండ్ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్శింహ ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Also Read: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు
రోగులకు తిప్పలు..
జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో సెల్ ఫోన్, టార్చిలైట్లు వెలుతురులో డాక్టర్లు రోగులకు వైద్య సేవలు అందించారు. జనరల్ విభాగంలోని ఓ వార్డులో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఓ మహిళా రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు సెల్ఫోన్, టార్చిలైట్ వెలుతురులో బీపీ పరిశీలించి వైద్య పరీక్షలు చేశారు.
రోగులకు తిప్పలు..
జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో సెల్ ఫోన్, టార్చిలైట్లు వెలుతురులో డాక్టర్లు రోగులకు వైద్య సేవలు అందించారు. జనరల్ విభాగంలోని ఓ వార్డులో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఓ మహిళా రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు సెల్ఫోన్, టార్చిలైట్ వెలుతురులో బీపీ పరిశీలించి వైద్య పరీక్షలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోమవారం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
20 రోజుల్లో 9సార్లు చెప్పారు..
For More AP News and Telugu News