Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:36 AM
షూటింగ్లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు.

ఈడీకి సినీ హీరో మహేశ్ బాబు లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): షూటింగ్లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తాను సినిమా షూటింగ్లో ఉన్నానని.. విచారణకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సురానా గ్రూపు, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలకు సంబంధించిన ప్రకటనల్లో మహేశ్ నటించారు.
సాయి సూర్య డెవలపర్స్ ప్రకటనల్లో నటించినందుకు మహేశ్ బాబుకు రూ.5.9 కోట్లు పారితోషికం చెల్లించారు. అందులో రూ.2.5 కోట్లు నగదు రూపంలో ఇచ్చారు. ఇటీవల జరిగిన ఈడీ సోదాల్లో ఈ విషయం వెల్లడికావడంతో మహేశ్బాబు 28న విచారణకు రావాలని ఈడీ నోటీసు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News