Share News

Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - May 02 , 2025 | 05:40 AM

రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రెండు రాష్ట్రాలు జాతి ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

  • జాతి ప్రగతిలో ఆ 2 రాష్ట్రాలు కీలకం:గవర్నర్‌

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): మహరాష్ట్ర, గుజరాత్‌ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన మహరాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ.. జాతి ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశ ఆర్థిక రాజధానిగా మహరాష్ట్ర నిలిస్తే, దేశానికి గుజరాత్‌ పటిష్టమైన నాయకత్వం అందించిందని చెప్పారు. దేశ సమగ్రతను పెంపొందిస్తూ జాతీయ భావ వ్యాప్తికి ఏక్‌ భారత్‌ - శ్రేష్ట భారత్‌ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆ రెండు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణ, గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవరథ్‌ పంపిన వీడియో సందేశాలను ప్రదర్శించారు.


For Telangana News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:45 AM