Komatireddy: కవిత లేఖ అంతా ఒక డ్రామా!
ABN , Publish Date - May 24 , 2025 | 03:11 AM
కేసీఆర్కు కవిత లేఖ అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనూ ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): కేసీఆర్కు కవిత లేఖ అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనూ ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. దీంతో అంతర్గతంగా వాళ్లే ప్లాన్ చేసుకుని.. కవిత పేరుతో లేఖను విడదల చేసి డ్రామాలు ఆడుతున్నారన్నారు. నేరుగా ఇంటికి వెళ్లి మాట్లాడే అవకాశం ఉన్న కవిత.. లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. శుక్రవారం వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కవిత, కేటీఆర్లు కొట్టుకుంటే ఆస్తుల పంపకాల కోసం కొట్టుకుంటారని వ్యాఖ్యానించరు.. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు పోరాడి సాధించుకున్నామని, మధ్యలోకి కేసీఆర్ వచ్చి దూరాడని వ్యాఖ్యానించారు. మేడిగడ్డకు బాంబు పెట్టి పేలిస్తే పైన పేలుతుంది కానీ.. కింద ఎలా పేలుతుందంటూ కేటీఆర్ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులో బాంబులు పెడితే.. అప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారని నిలదీశారు.
కేసీఆర్ జవాబివ్వాలి: పొన్నం
కవిత లేఖపై కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి రజతోత్సవ సభలో మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని, బీజేపీపై విమర్శలు ఎందుకు చేయలేదంటూ కవిత అడిగిన ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీని కాంగ్రెస్ తొలినుంచీ నిలదీస్తోందని, కవిత లేఖతో ఇది తేటతెల్లమైందన్నారు. బీఆర్ఎస్ మునిగే నావ అని, ఎమ్మెల్సీ కవిత అందులోంచి దూకేయాలని చూస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. పదేళ్ల పాపాలను లేఖ ద్వారా బయటపెట్టిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..