రక్తదానానికి యువత ముందుకు రావాలి
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:58 PM
రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడ టానికి యువకులు ముందుకు రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.

కళ్యాణ్నగర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడ టానికి యువకులు ముందుకు రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది రక్తం కోల్పోయి సమయానికి రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారని, రక్తదానం ఒక ప్రాణదానమన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలని సూచించారు.
దీని వల్ల ఎదుటి వ్యక్తిని రక్షించడమే కాకుం డా ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో రక్తనిల్వలు ఉండేవిధంగా చూడాలని ఎమ్మెల్యే ఆసుపత్రి వర్గాలకు సూచించారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రక్తదానం చేయడంతో పలువురు వైద్యులు, యువకులు రక్తదానం చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేష్, గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, నాయకులు మహంకాళి స్వామి, ఆర్థో ప్రొఫెసర్ రాజు, పీఆర్ఓ అన్వర్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.