Home » Sircilla
లోక్ అదాలత్లతో సత్వర న్యాయం సాధ్యమని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొ న్నారు. శనివారం కోర్ట్ కాంప్లెక్స్లలో నిర్వహించిన లోక్ అదాలత్లో సబ్ జడ్జి జీవన్ సూరజ్సింగ్, జూనియర్ సివిల్ జడ్జిలు వెంకట సచిన్ రెడ్డి, వెంకటేష్ గురువ, స్వారికలు పాల్గొన్నారు.
రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడ టానికి యువకులు ముందుకు రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
విద్యారంగ సమస్యలు పరి ష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివా రం బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు శని గరపు రజినీకాంత్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి లేనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలతో తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవి లభించిన అనంతరం ఆయన చెన్నూరు వెళుతుండగా సుల్తానాబాద్లో ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో తమ దశ మారుతుందని ఆశపడ్డ కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో పడిపోయాయి. ఎన్నికలకు ముందుగాని మళ్లీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం లేనందువల్ల ఈ నియోజకవర్గం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదనే భావనతో డీలా పడుతున్నారు.
సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా కౌలు రైతుల ఆశలు నెరవేరడం లేదు.
పల్లె పోరుకు ప్రభుత్వం మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీలో పొలిటికల్ సందడి మొదలైంది. 15న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు.. పేదోడైతే చాలనుకున్నాం.. ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని, చివరకు పింకు షర్టు తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తామని, తల తాకట్టు పెట్టయినా పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
వ్యాపారులు, మధ్యదళారులు, విత్తన కంపెనీల వల్ల నష్టపోయిన రైతాం గానికి ఉచిత న్యాయం అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జడ్జి స్వరూపరాణి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం చట్టాలపై మండలంలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రైవేట్ విద్యా సంస్థల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని, అనేక వసతి సౌకర్యాలు కల్పిస్తుందని జిల్లా విద్యాధికారి మాదవి అన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.