Home » Sircilla
రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మంథని మున్సి పాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంద టానికి స్పెషల్ ఇండస్ట్రి యల్ పార్కును మం థని శివారులో ఏర్పాటుకు కృషి చేస్తున్నామ న్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల ఎంపీలను కలుపుకుని ఉద్యమించామని, అప్పుడు తనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చినా తెలంగాణ కోసం వదులుకున్నానని రాష్ట్ర గను లు, భూగర్భ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి పెద్దప ల్లిలో నిర్వహించిన ఆత్మీయ పౌర సన్మానంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఆర్జీ-1 ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఉపరితల గనిని శనివారం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కర్నాటి వరుణ్రెడ్డి సందర్శించారు. మేడిపల్లి ఉపరితల గని వద్ద నిర్మించనున్న పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్జీ-1 ఏరియా జీఎం లలిత్కుమార్తో కలిసి మేడిపల్లి ఉపరితల గని వ్యూ పాయింట్ ద్వారా సందర్శించారు.
తల్లిపాలు పిల్లలకు శ్రేయస్కరమని సిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సంద ర్భంగా శనివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పిల్లల వైద్యులు, గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి తిరిగి అధికారంవైపునకు అడుగులు వేయాలని బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తోడుగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకొని జిల్లా పరిషత్లు, మండల పరిషత్లను, పంచాయతీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం రూపొందిస్తున్నది.
పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, డుమ్మాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీరాజ్శాఖ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. సుమారు రెండు నెలలుగా జిల్లాలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కొనసాగుతోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పక్కాగా ఉండే దిశగా ఫేస్ రికగ్నిషన్ యాప్ను ప్రవేశపెట్టింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలక వర్గాలకు పొడిగించిన పదవీ కాలం ఈ నెల 14వ నాటికి ముగియనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టక పోగా, పాలక వర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తారా, ప్రత్యేక అధికారుల పాలన తీసుక వస్తారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, ఎవరైన రైతులు పాస్బుక్ తీసుకురాకుండా వస్తే సాగు ఎక్కడ చేస్తున్నారో వివరాలు తెలుసుకొని ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.
మండలంలోని రత్నాపూర్లో ఇం డస్ట్రీయల్ పార్క్పై శుక్రవారం ఆర్డీవో సురేష్ అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఆర్డీవో సురేష్ ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టపరిధికి లోబడి ఇండ్రస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయనుందని, అందుకు కావాల్సిన 203 ఎకరాల భూములు మేడిపల్లి పరిధిలోని 63 మంది రైతుల వద్ద సేకరిస్తామన్నారు. దీని పై గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.